హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూత

చెన్నై: ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూశారు. స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేల జన్మించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. ఈ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 250కి పైగా చిత్రాలలో నటించిన  సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం. నాలుగుస్తంభాల ఆట సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. జంద్వాల సినిమాల ద్వారా ఆయన హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందేమాతరం సినిమాకు ఆయనకు అవార్డు లభించింది.

తాజావార్తలు