హెల్త్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ

 యువ నాయకుడు ఆర్ కిశోర్           అలంపూర్ ఆగష్టు 17 జనంసాక్షి            నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటిరాములు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం అలంపూర్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పాలు బ్రెడ్లు  టిఆర్ఎస్ తాలుకా అధ్యక్షుడు యువ నాయకుడు కిశోర్ గారు పంఫీణ చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ మన ఎంపి  నిండు నూరేళ్ళు జీవించాలని,ఆయువు ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఉన్నత హోదాలో వుంటు ప్రజలకు సేవా చేయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటూనట్లు తెలిపారు ,అనంతరం హాస్పిటల్ సిబ్బందితో సమస్యలపై ఆరా తియగా హాస్పిటల్లో  కుర్చిలు(60) డస్టబిన్(10) కోరత వున్నాయి డాక్టర్లు ఆర్ కిశోర్ దృష్టికి తీసుకురాగా,దానికి సానుకూలంగా స్పందించి నేను ఏర్పాటు చేస్తా అని హమీ ఇచ్చారు.రోగులతో మాట్లాడుతూ వైద్యులు దేవుళ్ళుతో సమానం కావున వారిసూచనమేరకు వైద్యసహాయం తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు వైద్య నిపుణులు సయ్యద్ భాషా, మెడికల్ ఆఫీసర్ లక్ష్మన్న, ఆనంద్, జయరాం షేక్ వలి ఆన్వర్ భాషా కృష్ణ, భాస్కర్,చిన్న విజయ్ భీమేష్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.