హైకోర్టును విభజించండి : కేకే

please concentration on high court bifurcation

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడి తొమ్మిది నెలలు కావొస్తున్నా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కేంద్రాన్ని కోరారు. హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనపై కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. ఇప్పటికే తెలంగాణలో న్యాయవాదులు నిరసనలు చేస్తున్నారు. హైకోర్టును విభజించకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు.