హోంమంత్రి, ఆర్థిక మంత్రి పై 420 కేసు

రంగారెడ్డి,(జనంసాక్షి): తెలంగాణపై మాట మార్చారన్న అభియోగంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే,ఆర్థిక మంత్రి చిదంబరంలపై ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదైంది. అడ్వకేట్‌ జేఏసీ వేసిన పిటిషన్‌పై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.