1నుంచి పున:ప్రారంభం కానున్న కేదార్‌నాథ్‌ ఆలయం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని యాత్రికుల సందర్శనార్థం అక్టోబర్‌ 1నుంచి పున:ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. జూన్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు అనంతరం ఇటీవలే పూజలు నిర్వహించిన నేపథ్యంలో అక్టోబర్‌ 1నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఈ సంధర్బంగా ఆయన తెలిపారు.రహదారుల మరమ్మత్తు పూర్తికానందున కొద్దిమంది భక్తులను మాత్రమే దైవదర్శనానికి అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.