10రోజుల్లో రైతు రుణాలు మాఫీ
మోదీలా తాను శుష్క వాగ్దానాలు చేసేవాణ్ణికాదు
మోదీ, శివరాజ్ ప్రభుత్వాలతో బడా పారిశ్రామిక వేత్తలకే మేలు
రైతులకు ఒక్క పైసా విదల్చరు
యూపీఏ హయాంలో 70వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ
మాండసౌర్, జూన్6(జనం సాక్షి) : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘విూ (రైతులు) విూద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని మాండసౌర్లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంలో మాండసౌర్లో బుధవారం జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని శివరాజ్ సర్కార్పై నిప్పులు చెరిగారు. ‘మోడీ కావచ్చు, శివరాజ్ ప్రభుత్వం, లేదా బీజేపీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు. బడా పారిశ్రామికవేత్తలకే వారు బాసటగా నిలుస్తారు. రైతులకు ఒక్క పైసా కూడా విదల్చరు’ అని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.70,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రైతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాల్పులు జరిపి వారిని పొట్టనపెట్టుకుందని, దేశవ్యాప్తంగా రైతులు తమ హక్కుల కోసం నిలదీస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతు సభకు హాజరైన రైతు కుటుంబాలే అందుకు సాక్షమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాగానే రైతులు నేరుగా పొలాల నుంచే తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు దగ్గర్లోనే ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. మళ్లీ తాను మధ్యప్రదేశ్ వచ్చేసరికి ‘మేడ్ ఇన్ మాండసౌర్’ను చూడాలని అనుకుంటున్నానని, ఇందుకు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. తాను శుష్క వాగ్దానాలు చేసే రకం కాదని మోదీకి రాహుల్ చరకలు వేశారు. ‘రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తామని మోదీ వాగ్దానం చేసారు. విూ బ్యాంక్ అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని
గొప్పగా చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మోదీ నుంచి కనీసం ఒక్క రూపాయైనా విూలో ఎవరికైనా అందిందా?’ అని రాహుల్ ప్రశ్నించారు. మోదీని తాను ఒక్కసారి మాత్రమే కలిసానని రాహుల్ తెలిపారు. అదికూడా రైతు సమస్యల విూదే తాను మోదీని కలిసానని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని తాను కోరినప్పటికీ ఆయన మౌనంగానే ఉండిపోయారని రాహుల్ తెలిపారు.