13న జరిగే సెమినార్ ను విజయవంతం చేయండి…జులకంటి

మిర్యాలగూడ. జనం సాక్షి
స్వతంత్ర ఉద్యమం- కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై ఈనెల 13న మిర్యాలగూడలో జరిగే సెమినార్ ను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బిజెపి పార్టీ పాత్ర ఏమాత్రం లేదని గుర్తు చేశారు. ఇప్పుడు దేశ ప్రజలను మోసం చేసేందుకు ఘర్ ఘర్ కు తిరంగా అనే నినాదాన్నీ తీసుకొచ్చారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను మర్చిపోయినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమాన్ని నీరుగా ఎందుకు ప్రయత్నించిన బిజెపి పార్టీ గాంధీని చంపిన గాడ్సేను పూజించారని ఇప్పుడు గాంధీకి దండ వేసి దేశభక్తి పేరిట అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు వివరించేందుకు సెమినార్ నిర్వహిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, కార్యదర్శులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, సీనియర్ నాయకురాలు గాదె పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.