13 నుంచి శ్రీకృష్ణుడి వూరేగింపు
న్యూఢిల్లీ : వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13న శ్రీకృష్ణుడి బంగారు ప్రతిమను మధుర నుంచి కేరళలోని గురువాయూర్ ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బృందావనం, గోవర్ధనగిరిలతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోని పెద్ద ఆలయాల మీదుగా ఆ వూరేగింపు ప్రయాణించనుంది. ఈ నెల 29న గురు వాయూర్ చేరుకోనుంది.