13 లోక్‌సభ సీట్లు టీఆర్‌ఎస్‌కే : టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వినపడుతున్న తరుణంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తే యూపీఏ కూటమి ఓడిపోక తప్పదని సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్వీప్‌ ఆవుట్‌ చేస్తుందని ,పదమూడు లోక్‌సభస్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పింది.