గుజరాత్‌లోకి సముద్రమార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సముద్ర మార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా రాష్ట్రలను ఐబీ అప్రమత్తం చేసింది. ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.