కాల్పుల్లో 14మంది మావోయుస్టులు మృతి

ఒడిశా : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు సమీపంలోని మల్కన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14మంది మవోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అటవీప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. మల్కాన్‌గిరి ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్‌ నేతృత్వంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది.