15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన అగ్రనేత ,సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కార్యదర్శి చంద్రన్న ఆయన భార్య విజయలు ఐదుగురు దళ సభ్యులతో ఎస్పీ ముందు లొంగిపోయారు. వీరిద్దరిపై గడ్చిరోలీలో పలు కేసులు నమోదై ఉన్నాయి. మిగతా ఎనిమిది మంది భూంకాస్‌ మిలీషియా దళ సభ్యులుగా తెలుస్తుంది.