2రోజులు విధులు భహిష్కరించనున్న న్యాయవాదులు

హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 11,12 తేదిల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ప్రకారం ఉన్నత విద్యా పరిశోధన కోసం జాతీయా స్థాయిలో కమీషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.దేశంలోని అన్ని సంస్థలు దీని పరిధిలోనే పనిచేయాల్సీ ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇంతవరకు దేశంలోని న్యాయవిద్యాను పర్యవేక్షిస్తున్న బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఇకపై ఏలాంటి అధికారాలు ఉండవు. దీనిని నిరసిస్తూ మన రాష్ట్రంలోని న్యాయవాదులంతా విధులు భహిష్కరించనున్నారు.