2 of 2 నర్సాయిపల్లి గ్రామానికి నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రాక. రైతు వేదిక, క్రీడా ప్రాంగణం,

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 30 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి నేడు కొల్లాపూర్ నియోజక వర్గ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడానికి గ్రామంలో రానున్నారని గ్రామ సర్పంచ్ కె సత్యనారాయణ తెలిపారు. నర్సాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణమైన రైతు వేదికను ఓపెనింగ్ చేయనున్నారు. అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో ఒక స్కూల్ భవనాన్ని ఓపెన్ చేయనున్నారు. అనంతరం గ్రామంలోని క్రీడాకారులకు క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారని నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ కె సత్యనారాయణ  తెలిపారు. అదేవిధంగా నూతనంగా మంజూరైన 160 మందికి పెన్షన్స్  కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు.