20వతేదీ నుంచి కడపలో ఆమరణ దీక్ష

ఢిల్లీ(జ‌నం సాక్షి ): ఈనెల 20వతేదీ నుంచి కడపలో ఆమరణ దీక్ష చేస్తానని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి సమస్యలు వివరించేందుకు అపాయింట్ మెంట్ కోరినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదన్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కడప స్టీల్‌ప్లాంట్‌ గురించి విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.