2,00,000 రూపాయలు ఎల్వోసిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే భీరం

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రానికి చెందిన ఎన్  సువర్ణ భర్త నాగయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన  వైద్య ఖర్చుల కొరకు సీఎం సహాయనిధి కింద మంజూరైన 2 లక్షల రూపాయల ఎల్ఓసిని  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కింద అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఆపద్బాంధవుల ఆదుకుంటుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయంగా సహాయ నిధి కింద చికిత్స కు తగిన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తుందని అన్నారు.తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకొని రెండు లక్షల రూపాయల విలువసిని మంజూరు చేయించినందుకు, సువర్ణ కుటుంబ సభ్యులు  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు మండల  రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రావు, టిఆర్ఎస్ నాయకులు ఆదికొమ్ము దానయ్య,  క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.