సమైక్య భారతాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర
యైటింక్లయిన్ కాలని సెప్టెంబరు 17 (జనంసాక్షి): ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సమైక్య భారతాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్డ్ మూమెంట్ డాక్టర్ జే.ఆల్విన్ పేర్కొన్నారు.
సింగరేణి భవన్లో ఆయన ఆదివారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం .సురేష్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం ఐటి తదితర రంగాల్లో తన వంతు సహకారం అందిస్తు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా ఉంటోందన్నారు. అలాగే సింగరేణి సంస్థ తగినంత బొగ్గు ఉత్పత్తి మరియు థర్మల్ విద్యుత్ ద్వారా రాష్ట్ర ప్రగతికి సహకారం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, డీజీఎంలు ప్రదీప్ కుమార్, విజయేందర్ రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్ , సింగరేణి భవన్ అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు