సమైక్య భారతాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర
యైటింక్లయిన్ కాలని సెప్టెంబరు 17 (జనంసాక్షి): ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సమైక్య భారతాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్డ్ మూమెంట్ డాక్టర్ జే.ఆల్విన్ పేర్కొన్నారు.
సింగరేణి భవన్లో ఆయన ఆదివారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం .సురేష్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం ఐటి తదితర రంగాల్లో తన వంతు సహకారం అందిస్తు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా ఉంటోందన్నారు. అలాగే సింగరేణి సంస్థ తగినంత బొగ్గు ఉత్పత్తి మరియు థర్మల్ విద్యుత్ ద్వారా రాష్ట్ర ప్రగతికి సహకారం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, డీజీఎంలు ప్రదీప్ కుమార్, విజయేందర్ రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్ , సింగరేణి భవన్ అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు



