25 న జోగులాంబ ఆలయం ముసివేత

 

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 20)శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయాల ఈనెల 25వ తేదీన మంగళవారం సూర్య గ్రహణం ని పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది అని, ఆలయ శుద్ధి అనంతరం 7:30 తెరవడం జరుగుతుందని ఆలయ ఈవో పురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అమావాస్య సందర్భంగా నిర్వహించే మహా చండీ హోమం కార్యక్రమం రద్దు చేయనున్నట్లు ఈవో తెలిపారు.