చెన్నైఎయిర్‌ పోర్టులో 27కిలోల బంగారం పట్టివేత

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 27 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రైవేట్‌ కార్గో విమానంలో చెనైె చేరుకున్న ప్యాక్‌ చేసిన పెట్టేలపై అనుమానం వచ్చిన అధికారులు వాటిని క్షుణంగా పరిశీలించగా పెట్టెల్లోని సెల్‌ఫోన్లలో భద్రపరచిన పసిడి బయటపడింది. మొత్తం సెల్‌ఫోన్లలో 27 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అందర్జాతీయ విఫణిలో రూ.10కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.