కండక్టర్ ఉద్యోగం చేస్తున్న యోగనాథన్కు సోమవారం సెలవుదినం. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొక్కల పెంపకం.. పర్యావరణం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాడు. మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటి వరకు తమిళనాడులోని 32 జిల్లాలో 3వేలకు పైగా పాఠశాలల్లో పర్యావరణానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు. ఇటీవల పర్యావరణ దినోత్సవం రోజున యోగనాథన్ పిలుపుమేరకు పలు పాఠశాలల్లో విద్యార్థులు మొక్కలు నాటారంటే ఎంతలా కృషి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థులు నాటిన చెట్లకు వారి పేరునే పెట్టి చెట్లను సంరక్షించేలా ప్రోత్సహిస్తున్నాడు. బస్సు కండక్టర్గా చేరిన 17 ఏళ్లలో ఇప్పటి వరకు 40 సార్లు బదిలీ అయ్యాడు. అందుకు కారణం తరచూ సెలవులు పెట్టడమే. అయితే.. ఆ సెలవులు కూడా పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు, మొక్కలను పెంచేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నాడు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు యోగనాథన్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నాడు. ఉపరాష్ట్రపతి నుంచి ‘ఎకో వారియర్ అవార్డు’ను కూడా అందుకున్నాడు.