30వ వార్డులో పలు అభివృద్ధి పనులకు రెండు కోట్ల 10 లక్షలు మంజూరు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్…
వనపర్తి టౌన్* : డిసెంబర్ 5 ( *జనం సాక్షి )* వనపర్తి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 30 వ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెండు కోట్ల పదిలక్షల ఎస్టీ ఎస్ డి ఎఫ్ నిధులు,మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి మంజూరు చేయించారు.వనపర్తి 30 వార్డులోని బాలుర గిరిజన వసతి గృహము నుండి, విఘ్నేశ్వర కాలనీ, ఐజయ్య కాలనీ, సాయి నగర్ కాలనీ, జంగిడిపురం కాలనీ ల మీదుగా” సిసి రోడ్లు డ్రైనేజీల” నిర్మాణానికి ఈ నిధులను మంజూరు చేయించినారు. మున్సిపల్  వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 30వ వార్డులోని గిరిజన వసతి గృహం వెళ్ళే రహదారి గుంతల మయంగా ఇబ్బందిగా ఉండి విద్యార్థిని విద్యార్థులకు, కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా,మంత్రి ప్రత్యేక  చొరువతో “సిసి రోడ్లు డ్రైనేజీల” నిర్మాణానికి రెండు కోట్ల 10 లక్షలు మంజూరు చేయించారన్నారు.మంత్రి ప్రత్యేక చోరువతో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు నిరంజన్ రెడ్డి కి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తేదీ 6 ఉదయం 8:30 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా, ఈ పనులను ప్రారంభించనున్నారు.