32 వ వార్డులో క్రీడా ప్రాంగణ (పార్కు )నిధులు మంజూరు చేయించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….

 వనపర్తి జిల్లా కేంద్రంలో 32 వ వార్డు లో కేడి.ఆర్ నగర్ నందుగల పార్కుకు పంచాయతీరాజ్ నిధులను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో,పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం పార్కుకు 13 లక్షల ,25000/- రూపాయలు నిధులు శాంక్షన్ చేయించారు. 32వ వార్డు ప్రజలు, మరియు  స్థానిక కౌన్సిలర్ పండ్డెం నాగన్న యాదవ్, సంతోషం వ్యక్తపరుస్తూ,మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా అధ్యక్షుడు,మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, స్థానిక కౌన్సిలర్ పండ్డెం నాగన్న యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సత్యం సాగర్, రహీం, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, టీపిఎస్ సుధాకర్, సుమన్, మున్సిపల్ ఏఈ హేమలత, వార్డ్ అధ్యక్షులు మల్లికార్జున స్వామి, ధర్మారెడ్డి ప్రభు, లింగం రామ్ రెడ్డి ,కంది రమణ, నరసింహ ,రవీందర్, రఘునాయుడు, మహిళలు కంచ విజయలక్ష్మి ,రమాదేవి, భాగ్యమ్మ  తదితరులు పాల్గొన్నారు.