*5వ రోజు వీఆర్ఏల నిరవధిక సమ్మె…*

 పెద్దేముల్ జూలై 29 (జనం సాక్షి)
ముఖ్యమంత్రి అసెంబ్లీలో వీఆర్ఏలకు ప్రకటించిన పే-స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పెద్దముల్ వీఆర్వో సంఘం అధ్యక్షుడు రమేష్ హెచ్చరించారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ముందు 5వ రోజు కూడా వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలతో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు రమేష్  మాట్లాడుతూ…. వీఆర్ఏలకు ప్రమోషన్లు. పైబడిన వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పట్ల ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటయ్య,కార్యదర్శి శ్రీనివాస్. జిల్లా కోఆర్డినేటర్ కన్వీనర్ జంగయ్య,వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area