ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉన్న గోదావరి

రాజమండ్రి: గోదావరి వరద ఉద్దృతి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం బ్యారేజి వద్ద నీటిమట్టం 17.1 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి 18లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.