అభివృద్ధి పధాత నరేంద్రమోడీ : అద్వానీ
చత్తీస్గడ్, సెప్టెంబర్ 16 : గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ అందించిన ఘనత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకే దక్కుతుందని బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ అన్నారు. చత్తీస్గడ్లోని కోర్బా వద్ద ఎన్నికల ప్రచార సభలో సోమవారంనాడు అద్వానీ ప్రసంగించారు. పాలనలో నరేంద్రమోడీని చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. గుజరాత్లో మోడీ పాలనను ఆ రెండు ప్రభుత్వాలు అనుసరించాయన్నారు. విద్యుత్ రంగంలో ఆ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధిని సాధించాయని అన్నారు. మోడీపై పెద్ద బాధ్యత ఉంచామని అన్నారు. అభివృద్ధి ప్రధాత మోడీ అని అద్వానీ కితాబిచ్చారు. కాంగ్రెస్ విధానాలతో విసిగిన ప్రజలు బిజెపికేసి చూస్తున్నారని అన్నారు.