నైరోబీ మాల్‌ దుర్ఘటనలో మరో భారతీయుడి మృతి

ఢిల్లీ : కెన్యాలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో తీవ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య మూడుకు చేరింది. బెంగళూరుకు చెందిన సుదర్శన్‌ బి.నాగరాజ్‌ మృతిచెందినట్లు మంగళవారం విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. మందుల కంపెనీలో పనిచేస్తున్న శ్రీధర్‌ నటరాజన్‌ (40) అక్కడి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖ మేనేజర్‌ 8 ఏళ్ల కుమారుడు ఈ దుర్ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే.