దాడులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల హతం

నైరోబీ : కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆదేశ అధ్యక్షుడు ఉహురా కెన్యట్టా ప్రకటించారు. 11మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో 67 మంది మృతి చెందారని , వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.