రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నీ పరిశీలిస్తాం : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యలన్నింటిని కచ్చితంగా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల భాద్యులు దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంథీతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జరిపిన నేపద్యంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్‌ సంస్థలన్నీ పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేసి ఏం లాభమని ప్రశ్నించారు.తెలంగాణకు సంభందించి హోం శాఖ ముసాయిదా తయారు చేస్తుందని ఆయన చెప్పారు. కేబినేట్‌ నోట్‌ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామన్నారు.జగన్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కైందన్న చంద్రబాబు ఆరోపణలు అవాస్తమని ఆయన అన్నారు.