ముఖ్యమంత్రి కిరణ్‌ తీరుపై దిగ్విజయ్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియాతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహారిస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు.రెండు ప్రాంతాలకు సీఎం అన్న విషయాన్ని కిరణ్‌ మర్చిపోవద్దని గుర్తు చేశారు.కాగా సీమాంధ్ర ఉద్యమాన్ని కిరణే నడిపిస్తున్నట్లు ఆదిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సీఎంపై దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ప్రాదాన్యత సంతరించుకున్నది.