సైన్యం కోసం తొలిసారిగా ప్రత్యేక వేతన సంఘం

ఢిల్లీ : స్వతంత్య్ర భారతావనిలో తొలిసారిగా త్రివిధ దళాల్లో పనిచేసే సిబ్బందికోసం వేతన సంఘాన్ని నియమించనుంది.కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం నియామకానికి నేడు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ అంశం తెరమీదికి వచ్చింది.మిలీటరీ, పౌర ఉద్యోగుల మధ్య జీతాల్లో ఉన్న తారతమ్యాన్ని అధిగమించే ప్రయత్నం జరుగాలని త్రివిధ దళాధిపతులు గత ఏడాది రక్షణ మంత్రికి లేఖ రాశారు.