వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలమురు బరిలో రాహుల్గాంధీ ?
న్యూఢిల్లీ : రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు, తెలంగాణ -సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం మధ్య కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాందీ కేంద్రంగా ఆసక్తికరమైన ప్రణాళిక రచనా సాగుతొంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను తెలంగాణ ప్రాంతం నుంచి బరిలోకి దించాలన్నా ఆలోచనకు కాంగ్రెస్ తెలంగాణ నేతల్లోని ఒక వర్గం చెపుతుంది.రాహుల్ను పాలమూరు బరిలో దించడం వల్ల రాజకీయాలను పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా మలచుకోవచ్చని ఆ నాయకులు అంచనా వేస్తున్నట్లు సమాచారం.




