ఒబామాతో నేడు భేటీ కానున్న భారత ప్రధాని మన్మోహన్‌

వాషింగ్టన్‌ : రెండు రోజుల క్రితం అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురువారం వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయన శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో శుక్రవారం సమావేశమవుతారు.రక్షణ,ఆర్ధిక, ప్రాంతీయ సమస్యలపై ఇరునేతలు ప్రధానంగా చర్చించనున్నారు. మన్మోహన్‌ వెంట ఆయన భార్య గురుశరణ్‌ కౌర్‌, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్‌ మీనన్‌, వదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌ ఉన్నారు. మరోపక్క భారత్‌ -అమెరికా సంబంధాల బలోపేతానికి మన్మోహన్‌సింగ్‌ విశేషమైన కృషి చేశారంటూ అమెరికా సెనెట్‌ ప్రధానిని అభినందించింది.