అటవీ ప్రాంతంలో గుర్తతెలియని వ్యక్తి హత్య

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎల్మినేడు-కొంగరకలన్‌ గ్రామాల మద్య అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.మృతదేహం వద్ద ఓ ద్విచక్రవాహనం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.