స్నేహితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అత్యాచార ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఒకవైపు అత్యాచారానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న ,దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ,యావత్‌ భారతాన్ని కలచివేసి దేశవ్యాప్త ఉద్యమానికి కారణమైన నిర్భయ హత్యకేసులోని నిందితులకు ఉరిశిక్ష వేసినా ఈఘటనలు ఆగడం లేదు. దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం ఓ హోటల్లో 22 ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌ విద్యార్థినిపై తన స్నేహితుడే అత్యాచారాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. బాదితురాలి ఫిర్యాదు మేరకు వైభవ్‌ జైన్‌(27) అనే వ్యక్తిని శనివారం రాత్రి అతని నివాసం సెంట్రల్‌ ఢిల్లీ కరోల్‌ బాఘ్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కాగా భాదితురాలికి కూల్‌డ్రింక్‌లో మద్యం తాపించి ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మెడికల్‌ రిపోర్టులో నిర్దారణ కావడంతో నిందితున్ని అరెస్టు చేసి జ్యూడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నట్లు ఓ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.