సచిన్ తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ
న్యూఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అయితే 200వ టెస్టు ఆతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సచిన్ను తన 200వ మ్యాచ్ తర్వాత తప్పుకోవాలని బీసీసీఐ కోరనున్నట్లు ముంబై మిర్రర్ అనే పత్రిక తెలిపింది.ఈ విషయాన్ని మాస్టర్కు సూచనప్రాయంగా వెల్లడించాలని బీసీసీఐ భావిస్తుంది.