తెలంగాణ నోట్‌పై సంతకం చేసిన షిండే

న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో తెలంగాణ అంశంపై కేంద్ర హోం శాఖ తయారు చేసిన నోట్‌పై ఆశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే సంతకం చేశారు. దీని ప్రతులను కేంద్ర మంత్రులకు పంపించారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ నోట్‌పై నెలకొన్న ఉత్కంఠత తొలగిపోపయింది.