సమైక్యాంధ్ర కోసం టీడీపీ ,వైసీపీలు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు : దిగ్విజయ్‌ సింగ్‌

ఢిల్లీ : హైదరాబాద్‌లో జగన్‌, ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. టీడీపీ, వైసీపీలు లేఖ ఇచ్చాకే కాంగ్రెస్‌ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. విభజన ఎలా చేయాలో చంద్రబాబు చెబితే బాగుంటుందని ఆయన అన్నారు.