ఢిల్లీలో కుప్పకూలిన భవనం : ఐదుగురికి గాయాలు

ఢిల్లీ : నార్త్‌ ఢిల్లీ ఆజాద్‌ మార్కెట్‌ సమీపంలోని బారా హిందురావ్‌ ప్రాంతంలో మూడు అతస్ధుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూరావ్‌ ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.