శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముగ్గురు స్మగ్లర్ల నుంచి మూడు కిలోల బంగారంతో పాటు నకిలీ పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వేర్వేరు విమానాల్లో వచ్చారు. వీరిని కర్ణాటక ,కేరళకు చెందిన వారిగా కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.