భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ జర్నలిస్టుల దీక్షా

ఖమ్మం :భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. భద్రాచలంలో చేస్తున్న జర్నలిస్టుల దీక్ష మూడవ రోజుకు చేరింది. జర్నలిస్టుల ఆరోగ్యం మరంత క్షీణించిపోయింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి. జర్నలిస్టుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.