భద్రాచలం డివిజన్‌లో 72 గంటల బంద్‌

భద్రాచలం : తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్‌తో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈనెల 15,16,17,తేదీల్లో భద్రాచలం డివిజన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. లక్షలాది ఆదివాసులున్న భద్రాచలం డివిజన్‌ను పోలవరం కట్టేందుకు తెలంగాణ నుంచే వేరు చేయాలని చూస్తున్నారని ,ఈ కుట్రలను అడ్డుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు.