పార్లమెంట్‌ గేట్‌ వద్ద తెదేపా ఎంపీల ఆందోళన

ఢిల్లీ: పార్లమెంట్‌ ఒకటో నెంబరు గేటు వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎంపీలు నానాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీలు శివప్రసాద్‌, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, నిర్మల కిష్టప్ప తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.