వ్యాగన్‌ పరిశ్ర పనులు చేపట్టాలి

వరంగల్‌,జనవరి16: కాజీపేటలో నిర్మించాలనుకున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్తాపన చేసి పనులు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కోరారు. ఈ మేరకు వారు కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గేను కలసి వినతి పత్రం అందజేశారు. న్యూఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి రైల్వే, కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాజీపేటలో నిర్మించనున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్థాపన చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వేలో క్వార్టర్ల వసతుల పెంపునకు నిధులు కేటాయించడం లేదని, ఈ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని రైల్వే/-టసేషన్ల ముందు కమర్షియల్‌ కాం/-లపెక్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తర దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న కాజీపేటకు డివిజన్‌ ¬దా కల్పించాలని కోరారు.

తాజావార్తలు