జార్ఖండ్‌లో నలుగురు అధాకారుల అపహరణ

జార్ఖండ్‌: జార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా పిర్టాండ్‌లో నలుగురు అధికారులను మావోలయిస్టులు అపహరించారు. ప్రభుత్వ అధికారి, ముగ్గురు పంచాయితీ అధికారులను వారు అపహరించారు. అపహరణకు గురైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాసమి జయవర్ధన్‌ అనే అధికారి కూడా ఉన్నారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదేశించారు.