రాజస్థాన్ జైల్లో ఒక ఖైదీపై మరో ఖైదీ కాల్పులు
రాజస్థాన్: రాజస్థాన్లోని సికార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్న ఒక ఖైదీపై ఆదివారం మరో ఖైదీ కాల్పులు జరిపినట్లు సమాచారం. మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఈ సంఘటనలో గామపడిన ఖైదీ పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రికి తరలించామని జైలు అధికారులు తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన పిస్టల్, 10 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇద్దరు ఖైదీలూ వేర్వేరు కేసుల్లో ముద్దాయిలని వారు చెప్పారు.