నకిలీ నోట్లను అరికట్టేందుకే

ముంబై: 2005 ముందు నాటి రూ.500 నోట్లు. రూ.1000 నోట్లను ఉపసంహరించాలన్న తమ నిర్ణయానికి కారణం నల్ల ధనాన్ని నియంత్రించడానికి కాదని, నకిలీ నోట్లను అడ్డుకోవడానికి అని రిజర్వే బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మంగళవారం తెలిపారు. కొత్త నోట్లతో పోలిస్తే ఆ నోట్లకు తక్కువ భద్రత ఉంది అందుకే సాంకేతికపరమైన ఈ చర్యలు తీసుకుంటున్నాం. అని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ‘నల్ల ధనం, పన్ను ఎగరవేతలను అరికట్టడం మా ఉద్దేశం కాదని కూడా అన్నారు.