నిధుల వివరాలపై ఆప్ స్పందించడం లేదు : కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిజేయడం లేదని కేంద్రప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. పార్టీకి అందిన నిధుల వివరాలు, పూర్తి సమాచారం అడుగుతూ ఆప్కి గత నవంబరు 4న లేఖ రాసినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీ స్పందించలేదని, ఆ తర్వాత మరో లేఖ కూడా రాశామని అదనపు సొలిసటర్ జనరల్ రాజీవ్ మెహ్రా ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. ఆప్కి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియజేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.