గడువు పొడిగించవద్దని రాష్ట్రపతికి తెలంగాణ నేతల లేఖ

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు గడువు పొడిగించవద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఇప్పటికే వారం పొడిగించారని, మళ్లీ పొడిగింపు అవసరం లేదని వారు లేఖలో పేర్కొన్నారు.