*75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి-

మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్*
రాజేంద్రనగర్ ఆర్.సి. (జనం సాక్షి) :  75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు సిద్ధాంతిలో మంగళవారం కౌన్సిలర్ మేకల వెంకటేష్ తో కలిసి కాలనీవాసులకు జాతీయ జెండాలను పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు ప్రజలకు అందించనుందని తెలిపారు. పట్టణాల్లో పురపాలక శాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా త్రివర్ణపతాకాలను అందించనున్నారని వివరించారు.జాతీయ జెండాలను గ్రామ గ్రామాన ఇంటి పై ఆవిష్కరించాలని సూచించారు. జాతీయ జెండాను ఇళ్లపై పెట్టే క్రమంలో గాలి వానలకు జెండాలు కింద పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్,మేకల ఆనంద్,మహేష్,వెంకట్ రెడ్డి, రాజేందర్,శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : సిద్ధంతిలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్.