రాష్ట్రపతితో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా తెరాస అధినేత కేసీఆర్ సాయంత్రం 6.30కు రాష్ట్రపతితో భేటీకానున్నారు. తరువాత 7గంటలకు సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు.